Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

2వ రకం మధుమేహం, మెట్ఫోర్మిన్ వల్ల ఎలర్జీ 11567...India


15 మే 2015 న 52 ఏళ్ల మహిళ 6నెలలక్రితం నిర్ధారించిన మధుమేహం కోసం చికిత్స కోరుతూ, వైబ్రియోనిక్స్ అభ్యాసకుని వద్దకు వచ్చారు. ఆమె నమూనా ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి (ఆహారం తీసుకోకముందు బ్లడ్ షుగర్ : 190mg/dL, సాధారణం  70-110mg/dL; ఆహారం తీసుకున్న తరువాత : 250mg/dL, సాధారణ స్థాయి  70 - 150mg/dL). రోజువారీ (316mg / dL, సాధారణ 70-130mg / dL తో పోల్చినప్పుడు) యాదృచ్ఛిక బ్లడ్ షుగర్ పరీక్షా ఫలితాల ద్వారా ఆమె మధుమేహం ఇప్పటికీ నియంత్రణలో లేదు. మెట్ఫోర్మిన్ మరియు ఇతర మధుమేహం మందులకు ఆమె తీవ్రమైన అలెర్జీ తోపాటు (ఆమె వంకాయ, చేప, బంగాళాదుంపలు) వంటి ఆహారాలకు కూడా అలెర్జీలు కలిగినందున రోగి అల్లోపతి చికిత్సను పొందలేకపోయారు. మెట్ఫోర్మిన్ యొక్క ఒక మాత్ర వేసుకున్నా, అతిసారం, మైకము మరియు దద్దుర్లు కలుగుతున్నందున, ఆమె హోమియోపతి  ప్రయత్నింఛారు  కానీ ఫలితం లేకపోయింది. గత 3నెలలుగా ఆమె బలహీనమై, అలసటతో, పాదాలమంటతో బాధపడుతున్నారు. ఆమె నిద్రను ఆటంకపరుస్తూ ప్రతిరాత్రి  2, 3 సార్లు మూత్రవిసర్జనకు లేవవలసివచ్చేది. రోగి అనేక యిళ్లలో బట్టలు వుతుకుతూ, శారీరకశ్రమ, మానసిక ఒత్తిడికి గురయింది. ఆమె తండ్రికూడా మధుమేహం రోగి. తండ్రివల్ల జన్యుపరంగా వచ్చిన మధుమేహంతో, ఆమె ఒత్తిడితో కూడిన జీవితం అమెనీ పరిస్థితికి ప్రేరేపించిందని అభ్యాసకుడుభావించారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:

CC4.2 Liver & Gallbladder tonic + CC6.3 Diabetes + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic...TDS.

వైబ్రియోనిక్స్ చికిత్స పొందిన 10 రోజులలో ఆమె పాదాలమంట  ముందు ఉన్నదానిలో సగం తగ్గింది. ఆమె 2,3 సార్లు బదులుగా రాత్రికి ఒకసారి మాత్రమే బాత్రూమ్ కి వెళ్ళేది. ఆమె రక్తములో చక్కెరస్థాయి తగ్గడం ప్రారంభమైంది. 2నెలల్లో, ఆమె భోజనం తర్వాత రక్తచక్కెర 156mg / dL కు పడిపోయింది. మరో 1½ నెలలు చికిత్స తర్వాత, ఆమె ఉపవాసం మరియు భోజనం చేసిన రక్తం చక్కెరలు రెండు కూడా పూర్తిగా సాధారణమైనవి. (Fasting: 92mg/dL, Post-meal: 115mg/dL; 11 September 2015). 

అక్టోబరు 29న జరిపినపరీక్షలో, భోజనపు రక్తంలో చక్కెర (భోజనం ముందు: 90mg / dL,  భోజనం తరువాత: 181mg / dL) లో కొద్దిగా మెరుగుదల కనిపించింది. తదుపరి విచారణ తరువాత, రోగి కుమారుడు అక్టోబర్ 19 న తన తల్లికి వైరల్ జ్వరం వచ్చిందని, 6 రోజులు యాంటీబయాటిక్స్ తోసహా అల్లోపతిక్ మందులతో చికిత్స పొందినదని చెప్పాడు. ఈ సమయంలో, ఆమె తన వైబ్రియోనిక్స్ మందులు తీసుకోలేదు. కాని అప్పుడు రోగి బలహీనత, అలసట 50% తగ్గిందని చెప్పారు. ఆమె పాదాల నరాలవ్యాధి మార్పు లేదని చెప్పినది. వైద్యుడు రోగిని వైబ్రియోనిక్స్ ఆపవద్దని చెప్పి, సందేహమేదైనా వస్తే తన అభిప్రాయాన్ని తెలుసుకోమని ఆమెను ప్రోత్సహించాడు. నవంబర్ 2015 నాటికి, రోగి చికిత్స TDS తీసుకుంటూ కొనసాగింది. ఆమె మధుమేహం ఇప్పుడు నియంత్రణలో ఉంది. ఆమె చాలా సంతోషంగా ఉంది.