Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అభ్యాసకుల వివరాలు 00512...Slovenia


ప్రాక్టీషనర్ 00512…స్లొవేనియా   స్లొవేనియా కు చెందిన ఈ ప్రాక్టీ షనర్ గురించి వార్తాలేఖ సంపుటము 7 సంచిక 6 లో ఇవ్వబడింది . ఐతే పోలాండ్ ప్రాక్టీ షనర్ లతో వీరికి ఉన్న సన్నిహిత సంభందమును పురస్కరించుకొని వీరు పోలాండ్ జాతీయ వైబ్రో సదస్సుకు ఆహ్వానింప బడ్డారు. వీరి సమర్పణ వ్యాసంలో ఎన్నో అద్భుతమైన కేసుల గురించి ప్రస్తావన చేసారు.వీరి దృష్టిలో పేషంటు తో మొదటి సమావేశమే అత్యంత ప్రాధాన్యత కలిగినది. పేషంటు సందర్శనలో ప్రాక్టీషనర్ పట్ల నమ్మకము,గౌరవం,విశ్వాసము క్రమంగా పెరిగిఒక సానుకూల ద్రుక్పధం ఏర్పాటుకు దోహద పడుతుంది. ముఖ్యంగా వీరు పేషంట్లు చెప్పే విషయాలను జాగ్రత్తగా విని నోట్స్ లో వ్రాసుకొని ఖచ్చితమైన నిర్దారణకు వస్తారు.ఆత్మవిశ్వాసం లేకపోవడం ,తనకు తాను అంగీకరించక పోవడం ,ప్రేమలేకపోవడం,ఇవన్నీ వ్యాధికి కారణాలు అని వీరి భావన. ఇదే విషయం వీరు పేషంట్లకు కూడాతెలియజేస్తారు.

సాధారణంగా మన మానసిక భావోద్వేగాలకు కారణం గత అనుభవాలను బట్టి ఉంటుందని ఇవి ప్రస్తుత కాలంలో కోపము ,అసూయ,భయము రూపాలలో వ్యక్తమవుతూ ఉంటాయనే విషయం పేషంట్లు గ్రహించ లేరని  వీరి భావన. ముఖ్యంగా క్షమించే తత్వం అనేది అలవరచుకోవాలని ఇదే రోగ నిర్మూలనకు నాంది అని వీరి భావన. ఈ విధంగా కౌన్సిలింగ్ ద్వారా వీరు పేషంటు లో ఒక క్రొత్త జీవితానికి బాట వేస్తే వీరిచ్చే రెమిడి లు దేహంలోని మూలకణాలలోనికి వెళ్లి వ్యాధి మూలాలను నశింపజేస్తాయి.వీరి ఉద్దేశ్యంలో పేషంట్లు తమ చెడు అనుభవాలను కూడా పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దీనివలన సరియయిన రోగనిర్ధారణ జరిగి ప్రాక్టీ షనర్ ఇచ్చే రెమిడి లు సక్రమంగా వాడడం వారిచ్చే సూచనలు పాటించడం ద్వారా వ్యాధి లక్షణాలు పూర్తిగా నశిస్తాయి.  

ఈ ప్రాక్టీ షనర్ మన ఆరోగ్యమును మనమే కాపాడుకోవడానికి -మనమే తీసుకోవలసిన చర్యలు, మన పరివర్తన ఇలా రెండు విధాలుగా ఉంటుందనే భావన వ్యక్తంచేస్తున్నారు. మొదట మనకు వచ్చిన వ్యాధిని అన్ని స్థాయిలలో (భౌతిక,మానసిక,ఉద్వేగ పరంగా)అంగీకరించే స్థితి, దీనిని మనకు మనమే తగ్గించుకోవడానికి దృఢ సంకల్పము వహించడం.  దీనికి సహాయపడే కొన్ని అంశాలు భగవంతుడు అందరిలోనూ ఉంటాడని అందరితో సామరస్యముగా ఉండడం. ఇలా చేయడం వలన మన ఆంతరంగికంగా ,బాహ్యంగా కూడా పొందిక ఏర్పడి అది చక్కటి ఆరోగ్యానికి మార్గం సుగమం చేస్తుంది. ‘’రోగులుంటారు గానీ రోగం ఉండదు’’ అనే దానిని వీరు బలంగా విశ్వసిస్తారు.

మనం ఏది తింటామో అదే రిఫ్లెక్షన్ రూపంలో బయటకు వస్తుందని వీరి ఆభిప్రాయము.అందుకే వీరు తమ పేషంట్ల కు పౌష్టికాహారం,ఆరోగ్యనియమలు వివరించి తద్వారా వ్యాధి త్వరగా తగ్గడానికి మార్గం ఏర్పరుస్తారు. వీరి దృష్టిలో పాకేజ్ చేసిన ఆహార దినుసులలో పోషక విలువలు ఏమాత్రం ఉండవు. దీనికన్నా మాక్రో బయోటిక్ ఆహారము చాలా మంచిదని తన విషయంలోనే దీనిని నిర్ధరాణ చేసుకున్నానని అంటున్నారు.  మన జీర్ణ వ్యవస్థ శాఖాహారమునకు  సమర్ధ వంతంగా పనిచేస్తుందని వీరి అభిప్రాయము.మన మూత్రపిండాలలో శరీరానికి కావలసిన శక్తి ప్రోగుబడి ఉంటుందని ఇది తరిగి పోకుండా ఎప్పటికప్పుడు పునః పూరణ జరుగుతూ ఉంటుందని వీరి భావన. మనం జీవించడానికి రెండు లీటర్లనీరు,కొంత ఆహారము ఉంటే చాలని ఇంత మాత్రం కోసము జంతువులను చంపి తినడం మహాపాపమని అసలు ప్రపంచములో యుద్ధోన్మాదానికి ఈ జీవహింసే కారణమని వీరిభావన.   

వీరు నిస్వార్ధం గా మానవులకు,మొక్కలకు,జంతువులకు వైబ్రో రెమిడి లను నీటిలో కలిపి ఇస్తూ ఉంటారు.వీరి దగ్గరకు ప్రాక్టీషనర్ లు పనిచేయని మెషీన్లు తెచ్చి పెడుతూ ఉంటారు. వీటిని తిరిగిపనిచేసే టట్లు చేసి వాటితో అనేక రకాల సమస్యలకు ఉదాహరణకి యాక్సిడెంట్ లవలన గాయాలు,కోమాలో ఉన్న పేషంట్లు,మాదక ద్రవ్యాలకు బానిసలయిన పెద్దలు,పిల్లలు ఇలా   అనేక మందికి లబ్ది చేకూరుతున్నది. పాత యుగోస్లోవియా లోని జిల్లాల లోనూ అక్కడి ప్రాంతాలలోను డాక్టర్లు ఉండరు,మందులు దొరకవు కనుక అక్కడ వీరు వైబ్రో సేవలు అందిస్తున్నారు. వైబ్రో మందులను అక్కడి ప్రజలు బాగా నమ్ముతారు ఎందుకంటే ఈ మందులు వాడిన వారిలో 90% మందికి నయమయ్యింది.

 2015 లో ప్రాక్టీ షనర్ 1300 పేషంట్లకు వైద్యం అందించారు. 2016 నాటికి ఈ సంఖ్య 1704  పెరిగింది. మార్చ్ లో సదస్సుకు హాజరవడానికి వచ్చేనాటికి వీరు 430 పేషంట్లను చూసారు, వీరిలో కొత్తవారు 280 మంది. వీరికి వచ్చే పేషంట్లలో మెడికల్ డాక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ సదస్సులో కొన్ని అద్బుత అనుభవాలను వీరు సభికులతో పంచుకొన్నారు. వాటిని క్రింద పొందు పరచడం జరిగింది : ఒక లేడి డాక్టర్ కు సహాయకురాలిగా పని చేస్తున్న యువతి కారు ప్రమాదానికి గురి ఐన రెండు నెలల తర్వాత ప్రాక్టీషనర్ ను కలిసారు. ఆమె లివరు పూర్తిగానూ మరియు, శరీరపు ఎడమవైపు భాగము కూడా బాగా పాడయి పోయింది. మూడు నెలలు వైద్యం అనంతరం ఆమెకు ప్రతీ భాగము తిరిగి ఏర్పడడం ఆమె తిరిగి మాములుగానే నమలగలగడం,మాట్లాడ గలగడం చేయసాగింది. వైబ్రో చికిత్స గురించి తెలియని న్యురాలజిస్టులు ఏదో అద్భుతం జరగడం వలననే తప్ప లేనిదే ఇది అసాధ్యం  అన్నారు.

ఐతే మన వైబ్రో రెమిడి లు సూక్ష్మ స్థాయిలో పనిచేస్తే పైన చెప్పబడిన అనుబంధ పదార్ధాలు శారీరక లేదా భౌతిక స్థాయిలో పనిచేసి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

క్యాన్సర్ తో  బాధ పడుతున్న రోగులు దీనిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఇది భగవంతుడి వరంగా భావించాలి. తమలో ఉన్నదానిని గుర్తించి సాధ్యమయినంతవరకు తమ ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రయత్నించాలి. దీనిద్వారా సంపూర్ణ పరివర్తన దానిద్వారా వ్యాధి నివారణ కలుగుతుంది.  .

ఈ ప్రాక్టీషనర్ వివిధ రకాల వ్యాధులతో ఉదాహరణకు పొదుగు కు ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులతో బాధ పడుతున్న ఎన్నో జంతువులను (కుక్కలు,పిల్లులు,గుర్రాలు)వైబ్రో మందులతో త్వరగా నయం చేయగలిగారు.అలగే మొక్కలు,వృక్షాలు కూడా త్వరలోనే వ్యాదులనుండి విముక్తి పొందాయి.వాటికీ కూడా సొంత భావాలు,జ్ఞాపకాలు ఉంటాయని వీరి అభిప్రాయము. డాక్టర్ రుడాల్ఫ్ స్టీనర్  టెక్నిక్ ఉపయోగపెడుతూ 4 ఎకరాలలో కేవలం  జంతువుల విసర్జకాలను ఉపయోగిస్తూ జీవగతిక (biodynamic)  వ్యవసాయ క్షేత్రం  10 సంవత్సరాలుగా  నడుపుతున్నారు. డాక్టర్ స్టీనర్  ఈ సమకాలీన ఆంత్రో పోసోఫి (anthroposophy ) ఆవిష్కరణకు ,ఉత్తమ విలువలు గల బయో డైనమిక్ ఆహారము తయారీకి ఆద్యుడు అని చెప్పుకోవచ్చు.

ప్రస్తుత పరిణామాల దృష్ట్యా చూస్తే ఈ గడ్డుకాలంలో కూడా మానవత్వం ఇంకా జీవించే ఉంది అని ఈ ప్రాక్టీ షనర్ బలంగా నమ్ముతున్నారు. తన విషయమే చూసినట్లయితే వైబ్రియోనిక్స్ భోధనలు తన నెంతో ప్రభావితం చేస్తూ తన జీవన యాత్రను కొనసాగించేలా తోడ్పాటు నందిస్తున్నాయని వీరి అభిప్రాయము.ఉదాహరణకు వీరి ఇంట్లో వర్షపు నీరు రెండు పాత్రలలో పట్టి ఉంచబడింది.ఇవి రాగి తీగల ద్వారా తన SRHHVP మిషన్ లోని ఒక వెల్లుకు కలిపి బాబాను ప్రార్ధిస్తూ బాబా దీవెనలు అందుతున్నాయని మానసికంగా తలపోస్తూ మరొక వెల్లులో  NM86 Immunity మరియు  SR315 Staphysagria. ఉంచి నీటిని చార్జ్ చేయడం వలన ఆ నీరు త్రాగడానికి మరియు వంటకు అద్భుతంగా ఉపయోగ పడుతున్నాయని తెలుపు తున్నారు. చివరిగా వీరు స్లొవేనియా దేశంలోనే కాక యూరప్ లోని ప్రక్కనున్న దేశాలలో ఉన్న ప్రాక్టీషనర్లకు తన సహాయ సహకారాలను కొనసాగిస్తూనే ఉంటానని స్థిరంగా తెలియజేస్తున్నారు.