చాలా ఆహార పదార్ధాలకు ఎలర్జీ 10001...India
దుబాయ్కు చెందిన 10 ఏళ్ల బాలిక, తన తల్లితో కలిసి భారతదేశానికి వచ్చినప్పుడు, చాలా కాలంగా కొనసాగుతున్న అలెర్జీ లక్షణాలకు చికిత్స కోసం సంప్రదించింది. 2021 నుంచి రెండు సంవత్సరాలుగా ఆమెకు పదేపదే తీవ్రమైన తుమ్ముల దాడులు, ఆ తరువాత ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం, అప్పుడప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడేవి. ముక్కు బాగా మూసుకుపోవడం వల్లే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఉండవచ్చని భావించారు. యాంటీ-అలెర్జీ మాత్రలు తీసుకున్నప్పటికీ, ప్రతి ఎపిసోడ్ సుమారు ఒక వారం పాటు కొనసాగేది.
ఈ సమస్యలు ముఖ్యంగా ఆవు పాలు, పెరుగు, పనీర్ వంటి పాల ఉత్పత్తులతో పాటు స్ట్రాబెర్రీలు, నారింజ మరియు ఇతర సిట్రస్ పండ్లు తిన్నప్పుడు తప్పకుండా ప్రేరేపించబడేవి. ఈ ఆహార పదార్థాలను నివారించడం చాలా కష్టంగా ఉండేది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఆమెకు ఎప్పటినుంచో ఎంతో ఇష్టమైన ఆహారం కావడంతో మరింత ఇబ్బందిగా ఉండేది. 2022లో 2–3 నెలలు హోమియోపతి చికిత్స తీసుకున్నప్పటికీ ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఈ పరిస్థితి తల్లీకూతుళ్లిద్దరికీ ఎంతో బాధను కలిగించింది.
5 జనవరి 2023న, తల్లి అభ్యర్థన మేరకు, ప్రాక్టీషనర్ మొదట పాల ఉత్పత్తుల వల్ల వచ్చే అలెర్జీపై చికిత్స ప్రారంభించారు:
#1. Cow milk Potentised 200C…TDS
చికిత్స పురోగతి:
Ø 5 మార్చి 2023: ఆవు పాలు మరియు పనీర్ను జాగ్రత్తగా ఆహారంలో తిరిగి ప్రవేశపెట్టడం ప్రారంభించారు.
Ø 15 మార్చి 2023: పై ఆహార పదార్థాలను తీసుకున్న తరువాత ఎటువంటి అలెర్జీ లక్షణాలు కనిపించలేదు. #1ను ODకి తగ్గించారు.
Ø 12 ఏప్రిల్ 2023: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత #1ను నిలిపివేసి పండ్ల వల్ల వచ్చే అలెర్జీ కోసం #2. Strawberry & orange Potentised 200C…TDS ఇచ్చారు.
Ø 19 మే 2023: స్ట్రాబెర్రీ లేదా సిట్రస్ పండ్లు తిన్న తరువాత ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. #2ను ODకి తగ్గించారు.
Ø 15 జూన్ 2023: మోతాదును క్రమంగా తగ్గించిన తరువాత #2ను పూర్తిగా నిలిపివేశారు
ఆగస్టు 2025 నాటికి, బాలిక ఎటువంటి సమస్య పునరావృతం లేకుండా అన్ని రకాల ఆహార పదార్థాలను ఆనందంగా తీసుకుంటోంది.