బ్రహ్మ కమలం మొక్క పునరుజ్జీవింప చేయడం 11615...India
మొక్కల ప్రేమికురాలైన ప్రాక్టీషనర్ యొక్క పెద్ద కోడలు 5 సంవత్సరాల క్రితం బ్రహ్మకమలం (ససూర్య అబ్వలత) నాటారు. అది చక్కగా పెరుగుతూనే ఉంది కానీ ఒక పుష్పం కూడా వికసించలేదు. ఐతే తన మలబద్ధకం సమస్య కోసం మరియు కోవిడ్-19 మహమ్మారి సమయం లోనూ వైబ్రియానిక్స్ యొక్క ప్రయోజనాలను అనుభవించి ఉన్న మీదట వైబ్రియానిక్స్ మొక్కలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందని తెలుసుకున్న వెంటనే ఆమె తన మొక్కను పునరుజ్జీవింప చేయడానికి రెమిడీని అభ్యర్థించారు. 2020 జులై 15 న క్రింది రెమిడీ ఇవ్వ బడింది:
CC1.1 Animal tonic + CC1.2 Plant tonic…OD నీటిలో
సెప్టెంబర్ 15న ఒక పుష్పం వికసించినట్లు (చిత్రం చూడండి) ఆమె చాలా ఆనందంగా తెలిపారు. ఆమె ఒక్క రోజు కూడా మిస్ కాకుండా రెమిడీని కొనసాగించారు. నవంబర్ మొదటి వారంలో మరో మూడు పూలు పూసాయి. 2021 ఏప్రిల్ నుండి అది పుష్పించే కాలం కాదు కాబట్టి రెమిడీ నీటిని మొక్కకు అందించడం నిలిపివేశారు. మరుసటి ఋతువులో అనగా 2021 జులై నాటికి 5 పువ్వులు, (చిత్రాన్ని చూడండి) ఆ తర్వాత ఆగస్టు నెలలో 15 మరియు సెప్టెంబర్ నెలలో 18 పూలు(చిత్రాన్ని చూడండి) వికసించాయి. తనకు ఇష్టమైన మొక్క పునరుజ్జీవనం పొందడం వలన ఆమెకు మరలా రెమిడీ ఉపయోగించాల్సిన అవసరం రాలేదు. 2021 నవంబర్ నాటికి అ మొక్క పుష్పించడం కొనసాగిస్తూనే ఉంది.
*ఈ మొక్క హిమాలయ పువ్వుల రాజు అని పిలవబడే ఔషధమూలిక బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఇది సమర్పించబడుతూ ఉంటుంది.
