Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ముఖ పక్షవాతము, నరాల దౌర్బల్యం (న్యూరోసిస్) 11576...India


2015 డిసెంబర్ 3 న, తీవ్ర నొప్పి, ముఖంలో పక్షవాతం మరియు స్పర్శరహితమైన ఎడమ బుగ్గ, వంటి వ్యాధి లక్షణాలతో ఒక 30 ఏళ్ల వ్యక్తి చికిత్సా నిపుణులను సంప్రదించడం జరిగింది. ఇతను ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో వీడియో జాకీ గా ఉద్యోగం చేస్తున్న కారణంగా అధికంగా మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ఈ రోగ లక్షణాలు కారణంగా తాను ఆత్మగౌరవం కోల్పోవడమే కాకుండా తీవ్ర ఆతృత మరియు భయం తనలో కలుగుతున్నట్లుగా రోగి తెలిపారు. అంతేకాకుండా పీడ కలలు మరియు మానసిక ఆందోళనతో భాధపడుతున్నట్లుగాను రోగి తెలిపారు.

రోగికి ఈ రోగ లక్షణాలు మూడు వారాల క్రితం మొదలయ్యాయి. వైద్యుడుచే ఇవ్వబడిన 400mg ఇబుప్రోఫెన్ QDS తీసుకున్నప్పటికీ ఉపశమనం కలగలేదు. ఈ కారణంగా రోగి హోమియోపతి వైద్యుడను సంప్రదించి, మూడు వారాల వరకు ఈ చికిత్సను తీసుకుని, ఉపశమనం కలగనందువల్ల ఈ చికిత్సను కూడా నిలిపివేయడం జరిగింది. చికిత్సా నిపుణులు ఒక లోలకమును (పెండ్యులం) ఉపయోగించి రోగికున్న వ్యాధి లక్షణాలు, కుదృష్టి మరియు వామతంత్రము (బ్లాక్ మేజిక్) ద్వారా కలిగిన మనస్సంబంధమైన సమస్యలని కనుగొని క్రింది వైబ్రో మిశ్రమాలను తయారు చేసి ఇవ్వడం జరిగింది

ముఖ పక్షవాతానికి:
#1. CC3.7 Circulation + CC17.2 Cleansing + CC18.4 Paralysis + CC18.5 Neuralgia + CC20,4 Muscles & Supportive tissue… నీటిలో ప్రతి పావుగంటకు ఒకసారి. మెరుగుదల కనపడిన తర్వాత మోతాదును తగ్గించవలెను.

నరాల దౌర్భల్యం (న్యూరోసిస్) సమస్యకు:
#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders + CC17.3 Brain & Memory tonic…TDS నీటిలో

వైబ్రో మందును ప్రారంభించిన రెండు గంటల తర్వాత రోగికి తన ముఖంలో కొంత మెరుగుదల కనపడడంతో మందు యొక్క మోతాదును TDSకి తగ్గించుకున్నారు. మూడు రోజుల తర్వాత ముఖ పక్షవాతంలో 80% మెరుగుదల కనపడింది. రోగి యొక్క ఎడమ బుగ్గలో ఏర్పడిన స్పర్శహీనత చాలా వరకు తగ్గడంతో రోగి వీడియో జాకీ గా తన ఉద్యోగాన్ని కొనసాగించారు. ఒక నెల తర్వాత, రోగియొక్క ముఖంలో 95% మెరుగుదల కనపడింది. రెండు నెలల్లో పూర్తి ఉపశమనం కలిగినట్లుగా రోగి తెలిపారు. రోగికున్న నరాల దౌర్భల్యత ఐదు దినాల్లో 25% వరకు మరియు రెండు వారాల్లో 50% వరకు తగ్గింది. మూడు వారాల సమయంలో రోగికి నరాలకు సంబంధించిన రోగ లక్షణాల నుండి పూర్తి ఉపశమనం జరిగింది. అంతేకాకుండా అతనికి ఆందోళనకరమైన ఆలోచనలు మరియు పీడ కలలు రావడం పూర్తిగా ఆగిపోయినట్లుగాను తెలిపారు.

2016 ఏప్రిల్ నాటికి మందు యొక్క మోతాదు OW కి తగ్గించడం జరిగింది. ఆపై ఈ వ్యక్తి ఆనందంగానూ మరియు సంపూర్ణ ఆరోగ్యంతోనూ తన జీవితాన్ని కొనసాగించగలిగారు. 

రోగి యొక్క వ్యాఖ్యలు:
నాకు కలిగిన రోగ సమస్యలు కారణంగా నా జీవితం స్తంభించిపోయింది. మూడు వారాలు తీసుకున్న హోమియోపతి మందులు నాకు సహాయపడలేదు. నాకున్న సమస్యలన్నిటినీ సాయి వైబ్రియానిక్స్ అతి తక్కువ సమయంలో నయంచేసినందుకు నాకు ఎంతో ఆనందమగా ఉంది. ఏ విధమైన దుష్ప్రభావాలను కలుగ చేయని ఈ చికిత్స ద్వారా ఎంతో బాధాకరమైన ముఖ పక్షవాతం నుండి నేను విముక్తి పొంది నా ఉద్యోగాన్ని కొనసాగించగలిగాను.