పార్శ్వపు నొప్పి & అసిడిటీ 11652...India
18 ఏళ్ల బాలుడు 2018 నుండి గత ఐదేళ్లుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేవాడు, మండుతున్న ఎండలో పాఠశాల నుండి సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన తర్వాత ఈ నొప్పి ఏర్పడేది. మైగ్రేన్ నొప్పిగా నిర్ధారింప బడిన ఈ నొప్పి తన తలకి రెండు వైపులా బాధించేది. పెద్ద శబ్దాలకు గురి కావడం, చదువుకోవడం వంటివి తలనొప్పిని తీవ్రతరం చేసేవి. అతను ఒక వారం పాటు సూచించిన మందులు తీసుకున్నాడు, ఇది ఉపశమనం కలిగించినప్పటికీ ఆర్థిక పరిమితి అతనిని చికిత్స కొనసాగకుండా నిరోధించింది. ఐతే నొప్పి లేపనం రాయడం వలన అతను 2 నుండి 4 గంటల పాటు నిద్రపోయేవాడు, ఫలితంగా పూర్తి ఉపశమనం లభించేది.
గత మూడు సంవత్సరాలుగా వారానికి 3 నుండి 4 సార్లు తలనొప్పి తో పాటు మైకము మరియు ఛాతీలో మండుతున్న అనుభూతి కూడా కలగసాగేవి. ఆయుర్వేద డైజెస్టివ్ టాబ్లెట్ (హాజ్మోలా) మంట నుండి ఉపశమనం అందించేది. అయినప్పటికీ తను ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనసాగించినప్పటికీ అతని లక్షణాలు కొనసాగుతూనే ఉండటం అతని చదువును గణనీయంగా ప్రభావితం చేసింది. అతను వారానికి 2 నుండి 3 సార్లు విద్యాలయానికి వెళ్లకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. సెలవులలో అతను సూర్యరశ్మికి ప్రభావితం కాకుండా ఉన్నప్పుడు అతను బాగానే ఉన్నాడు. దీనికి అదనంగా మూడు సంవత్సరాల క్రితం అతను నత్తిగా మాట్లాడడం ప్రారంభమయ్యింది, అది కాలక్రమేణా మరింత తీవ్రమైంది. అయితే ప్రాక్టీషనల్ దీనికి తరువాత చికిత్స చేయాలని భావించి 2023 మే 12వ తేదీన అతనికి క్రింది రెమిడీ ఇచ్చారు:
CC4.10 Indigestion + CC11.4 Migraines + CC14.1 Male tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic…TDS
మే 25న రెండు వారాలపాటు శ్రద్ధగా, తెలివిగా, జాగరూకతతో రెమిడి తీసుకున్న తర్వాత పార్శ్వపు నొప్పి తీవ్రత సగం తగ్గి వారానికి 2 సార్లు మాత్రమే వస్తున్నట్లు అతను ఉత్సాహంగా తెలిపాడు. అంతేకాక తేలికపాటి మైకము మరియు మంట యొక్క సందర్భాలు 2 నుంచి 3 మాత్రమే ఉన్నాయి. అతనికి ఇప్పుడు నొప్పి లేపనం కానీ, మంటను తగ్గించే ట్యాబ్లెట్ యొక్క అవసరం రాలేదు. అతని శక్తి స్థాయిలలో మెరుగుదల ఏర్పడి అతను ఇప్పుడు చదువుపై బాగా దృష్టి పెట్టగలిగాడు.
మూడు వారాల తర్వాత జూన్ 16న అతని తదుపరి సందర్శన సమయంలో చాలా రిలాక్స్డ్ గా మరియు సంతోషంగా కనిపించాడు ఇప్పుడు తలపోటు 80% తక్కువ తీవ్రత తో వారానికి ఒకసారి మాత్రమే వస్తోంది. మరో నెలలో తలనొప్పి రెండు సార్లు ఇబ్బంది పెట్టడం మినహా మైకము మరియు మంట పూర్తిగా అదృశ్యమైనవి. అతను రోగ కారకాలకు గురైనప్పుడు కూడా రోగ లక్షణ రహితంగా ఉన్నందున ఆగస్టు 18 న మోతాదు BD కి తగ్గించబడింది. ఇది అక్టోబర్ 8 న ఆగిపోయే ముందు క్రమంగా మరింత తగ్గించబడింది. వైబ్రియానిక్స్ ప్రారంభించిన తర్వాత అతను ఒకరోజు కూడా పాఠశాలకు వెళ్ళకుండా ఉండలేదు!
2024 ఏప్రిల్ 9 నాటికి, ఎలాంటి లక్షణాలు పునరావృతం కాలేదు, లాప్టాప్ ఎక్కువ సేపు ఉపయోగించడంతో అతనికి తేలికపాటి తలనొప్పి వస్తూ ఉండడంతో ఇది అతని స్క్రీన్ టైం ని సమర్థవంతంగా నిర్వహించేలా ప్రేరేపించింది. అతను 2023 అక్టోబర్ 20 నుండి నత్తి కోసం రెమిడీ తీసుకుంటున్నాడు, ఆరు నెలల్లో ఒక 50% మెరుగుదల కనిపించింది.